calender_icon.png 26 April, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత స్వయంకృషితో ఆర్థికంగా ఎదగాలి

25-04-2025 05:49:12 PM

బసంత్ నగర్ లో టీ స్టాల్ ప్రారంభోత్సవంలో దుద్దిల్ల శ్రీను బాబు..

పాలకుర్తి (విజయక్రాంతి): యువత స్వయంకృషితో ఆర్థికంగా ఎదగాలని కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు.  పాలకుర్తి మండలంలోని బసంత్ నగర్ టోల్గేట్ ప్లాజా వద్ద దాసరి సాగర్, బోగోజు అశోక్ లు నూతనంగా ఏర్పాటు చేసిన ఇరాని డ్యూడ్ టీ స్టాల్ ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) సోదరుడు కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దుద్దిళ్ల శ్రీను బాబు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడుతూ... యువత ఉద్యోగాలు రావడం లేదని అధైర్య పడకుండా స్వయంకృషితో సొంత వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. టీ స్టాల్ ను ఏర్పాటుచేసిన యువకులను శ్రీనుబాబు అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సూర సామ్మయ్య తదితరులు పాల్గొన్నారు.