calender_icon.png 20 October, 2024 | 12:43 AM

డబ్బింగ్ పూర్తి

25-07-2024 12:05:00 AM

రామ్ పోతినేని జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలీ, గెటప్ శ్రీను కూడా ఇందులో నటిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ ద్వారా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ తెలుగులో తొలిసారి ఫుల్ లెంత్ రోల్ పోషిస్తున్నారు. తాజాగా సంజయ్ దత్ తన పాత్రకు సంబంధించి డబ్బింగ్ పూర్తి చేశారు. దత్ హిందీలో వాయిస్ అందించటం ద్వారా తన పాత్రకే కాకుండా, సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారని దర్శక నిర్మాతలు పేర్కొన్నారు. పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు పూర్తి కావస్తున్న ఈ చిత్రఆగస్టు 15న విడుదల కానుంది.