మెదక్: చేగుంట పట్టణ కేంద్రంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. చేగుంట నుండి గజ్వేల్ కు వెళ్లే రహదారిలో గుంతలు ఏర్పడి వాహనదారులకు ఇబ్బందులు జరుగుతున్న, ఎందుకు పట్టించుకోవడంలేదని ఆర్ అండ్ బి అధికారులపై కొత్త ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తక్షణమే చేగుంట నుండి గజ్వేల్ వరకు రోడ్డు మరమ్మత్తులు చేయాలని, అదేవిధంగా రోడ్డు పక్కన ఉన్న కరెంటు స్తంభాలను తొలగించాలని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.