11-03-2025 08:02:50 PM
కాటారం,(విజయక్రాంతి): తెలంగాణ బంజారా ఎంప్లాయిస్ సేవా సంఘం(Telangana Banjara Employees Service Association) జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం కాటారం డీఎస్పీ గడ్డం రాం రామ్మోహన్ రావు చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రెస్స్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముక్లోత్ కిషన్ నాయక్, ఆలోత్ భోజ్యా నాయక్, గౌరవ అధ్యక్షులు లావుడ్యా జగన్ నాయక్ తో పాటు బంజారా సేవా సంఘం కాటారం అద్యక్ష ప్రధాన కార్యదర్శులు లావుడ్యా రమేష్ నాయక్, అజ్మీరా రవిందర్, రాజు నాయక్, దేవు నాయక్, సక్కారాం నాయక్, రవి నాయక్ ప్రతాప్, జైపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.