నల్లగొండ జిల్లాలో అభ్యర్థి మహిళ.. హాల్టికెట్పై పురుషుడి ఫొటో
కరీంనగర్లో ఓ అభ్యర్థికి మరో జిల్లాతో హాల్టికెట్
నల్లగొండ/కరీంనగర్, జూలై 14 (విజయక్రాంతి): డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు విద్యాశాఖ తప్పిదాలతో తలలు పట్టుకుంటున్నారు. హాల్టికెట్ల జారీలో తప్పులు వస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. నల్లగొండకు చెందిన ఓ మహిళా అభ్యర్థి హాల్టికెట్పై ఆమె ఫొటో కాకుండా ఓ పురుషుడి ఫొటో ముద్రితమైంది. అలాగే కరీంనగర్ జిల్లాకు చెందిన అభ్యర్థి ఒక జిల్లాలో పరీక్ష రాసేందుకు ఆప్షన్ ఇవ్వగా, హాల్టికెట్పై మరో జిల్లా వచ్చింది.
నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన రుద్రవరపు భవ్య ఇటీవల డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్నది. ఆదివారం ఆమె హాల్టికెట్ డౌన్లోడ్ చూసుకో గా, దానిపై పురుషుడి ఫొటో ఉండటంతో ఆమె ఖంగుతున్నది. అలాగే కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కొర్కల్కు చెందిన పోరెడ్డి సౌజన్య డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్నది. ఆమె కరీంనగర్లో పరీక్ష రాస్తానని ఆప్షన్ ఎంచుకోగా, హాల్టికెట్లో ఖమ్మంలో పరీక్షా కేంద్రం ముద్రితమైందని చూసి ఆందోళనకు గురైంది. తప్పిదాలపై అభ్యర్థులు హెల్ప్డెస్క్కు ఫిర్యాదు చేసినప్పటికీ, అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేదని అభ్యర్థులు వాపోయారు. విద్యాశాఖ తప్పిదాలతో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న ఎంతోమందికి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించడంపై అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.