calender_icon.png 19 October, 2024 | 6:05 PM

కారులో 90 కిలోల ఎండు గంజాయి

19-10-2024 03:31:35 PM

రామాయంపేట: మెదక్ జిల్లా ప్రమాదానికి గురైన కారులో 90 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట 44వ జాతీయ రహదారిపై శనివారం ఓ కారు ప్రమాదానికి గురైందన్న సమాచారంతో రామాయంపేట పోలీసులు ఘటన స్థలానికి వెళ్లారు. కారులో ఎవరూ లేకపోవడంతో తనిఖీ చేయగా 32 ప్యాకెట్ల ఎండు గంజాయి లభించినట్లు సీఐ వెంకట రాజా గౌడ్ తెలిపారు. హైదరాబాదు నుండి నిజామాబాద్ వైపు వెళ్తూ రామంపేట వద్ద కారు ప్రమాదానికి గురైనట్లు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న వారు పారిపోయినట్లుగా తెలుస్తోంది. గంజాయి ఎక్కడి నుండి తరలిస్తున్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులకు తెలిపారు.