calender_icon.png 24 October, 2024 | 10:38 PM

50 కిలోల ఎండు గంజాయి పట్టివేత

24-10-2024 08:59:05 PM

పటాన్ చెరు,(విజయక్రాంతి): అక్రమంగా కారులో గంజాయి తరలిస్తున్నారని నమ్మద్దక సమాచారం రావడంతో వాహనాలు తనిఖీ చేసి గంజాయిని పట్టుకున్నామని పటాన్చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపారు. గురువారం బీడీఎల్ బానూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. బ్రిజా కారులో తరలిస్తున్న రూ.12.50 లక్షల విలువగల 50 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని బాల్కీకి చెందిన మల్లేష్ జాదవ్(26) అనే వ్యక్తిని అదుపులో తీసుకొని రెండు కార్లు, ఒక బైక్, రెండు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఒరిస్సాలోని మల్కాన్ గిరి నుండి మహారాష్ట్ర వైపు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది అన్నారు. గంజాయి తరలిస్తున్న దాదా పాటిల్, ప్రవీణ్, బీదన్ పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.