దౌర్జన్యానికి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు ఎస్ఐ చంద్రకుమార్
రామగిరి,(విజయక్రాంతి): మద్యం మత్తులో ఆర్టీసీ మహిళా కండక్టర్ తో దురుసుగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదైంది. రామగిరి ఎస్ఐ చంద్రకుమార్ కథనం ప్రకారం.. కరీంనగర్ నుండి మంథని వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు రాత్రి 09.00 గంటల సమయంలో తెలంగాణ చౌరస్తా, సెంటినరి కాలనికి చేరుకుంది. మద్యం మత్తులో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు కారును ర్యాష్ గా నడుపుకుంటూ వచ్చి బస్సుకు అడ్డంగా పెట్టి బస్సు డ్రైవర్ తో వాగ్వాదానికి దిగడారు. ఈ నేపథ్యంలో అడ్డుగా వెళ్లినటువంటి మహిళా కండక్టర్ పై దురుసుగా ప్రవర్తించి, దౌర్జన్యానికి దిగడంతో అక్కడున్న స్థానికులు అడ్డుకున్నారు. ఆర్టీసీ కండక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కమాన్ పూర్ మండలం గుండారం గ్రామనికి చెందిన రాచకొండ రవి, మోతె రాజయ్యలపై కేసు నమోదు చేసి కారు సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. మద్యం మత్తులో ఎవరైనా ఇలా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్ఐ చంద్రకుమార్ హెచ్చరించారు.