పరిస్థితి విషమించి వ్యక్తి మృతి
కొండపాక, అక్టోబర్ 15: మద్యం మత్తులో పురుగు మందు తాగి, పరిస్థితి విషమించి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన కూక్కునురుపల్లి మండలం మంగోల్ గ్రామంలో చోటుచేసుకున్నది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బస్వరాజుల వెంకటేశ్ ఇటీవల మద్యం మత్తులో పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు అపస్మారక స్థితిలోకి వెళ్లిన వెంకటేష్ను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ అసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం వెంకటేష్ మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.