calender_icon.png 28 October, 2024 | 9:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్

12-08-2024 12:15:00 AM

  1. బాటసారిని ఢీకొట్టిన కారు 
  2. అక్కడిక్కడే వ్యక్తి మృతి

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 11 (విజయక్రాంతి): మద్యం మత్తులో కారు డ్రైవిం గ్ చేయడంతో  ఓ బాటసారి ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం తెల్లవారుజామున గాజులరామారం పరిధిలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న గోపి(38)ని అతివేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గోపికి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు స్థానికంగా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తాడని పోలీ సులు నిర్ధారించారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.