హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. ఇద్దరు అంతరాష్ట్ర డ్రగ్ పెడ్లర్లను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఎల్బీనగర్ ఎస్ వోటీ పోలీసులతో కలిసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 40 కిలోల డ్రగ్స్, 10 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు.