calender_icon.png 23 October, 2024 | 3:10 AM

స్విగ్గీ డెలివరీ బాయ్ నుంచి డ్రగ్స్ స్వాధీనం

11-07-2024 12:10:00 AM

రాజేంద్రనగర్, జూలై10: స్విగ్గీ డెలివరీ బాయ్ నుంచి పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. బెంగళూరులో స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేసిన మురళీధరన్.. హైదరాబాద్‌లో ఎన్‌డీఎమ్‌ఏ డ్రగ్స్ విక్రయించడానికి వచ్చాడు. బుధవా రం శంషాబాద్ ఆర్‌జీఐఏ పోలీస్ స్టేష న్ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఎస్‌వోటీ పోలీసులు పట్టు కొని విచారించారు. తనిఖీ చేయ గా అతడి వద్ద 11 గ్రాముల ఎమ్‌డీఎమ్‌ఏ మత్తు పదార్థం లభించింది. ఈ మేరకు ఆర్‌జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.