29-04-2025 02:50:37 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్, గంజాయి పట్టిబడింది. మంగళవారం ఉదయం ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను హెచ్ న్యూ విభాగం అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.కోటి 40 లక్షల విలువైన 44 ఎల్ఎస్డీ బ్లాట్ లను, 1,380 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధిన పూర్తి వివరాలను ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ అదనపు సీపీ విశ్వప్రసాద్ వెల్లడిస్తారని అధికారులు పేర్కొన్నారు.