calender_icon.png 21 September, 2024 | 1:12 PM

రాచకొండలో మాదకద్రవ్యాల స్వాధీనం

21-09-2024 11:02:56 AM

హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలో మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. రెండు వేర్వేరు కేసుల్లో హాష్ ఆయిల్, గంజాయి చాక్లెట్లు పట్టుకున్నారు. మీర్ పేట్ పీఎస్ పరిధిలో 2.5 లీటర్లు హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. హాష్ ఆయిల్ సరఫరా కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 3.8 కిలోల గంజాయి చాక్లెట్లు పట్టుకున్నారు.