calender_icon.png 20 October, 2024 | 1:45 PM

బంజారాహిల్స్‌లో డ్రగ్స్ పట్టివేత

20-10-2024 12:00:00 AM

ముగ్గురి అరెస్ట్ 

హైదరాబాద్‌సిటీబ్యూరో, అక్టోబర్ 19 (విజయక్రాంతి): బైక్‌పై తరలిస్తున్న రూ.2 లక్షల విలువైన ఎండీఎంఏ డ్రగ్స్‌ను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు అమీర్‌పేట ఎక్సై జ్ పోలీసులు శనివారం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 7లో తనిఖీలు నిర్వహిం చారు. ఒక బైక్‌పై వెళ్తున్న ముగ్గురిని ఆపి తనిఖీ చేయగా 22.33 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ లభ్యమైంది. ఏపీలోని చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి నుంచి సుధాకర్‌రెడ్డి, నితిన్, ప్రకాశ్ అనే వ్యక్తులు డ్రగ్స్‌ను తీసుకొచ్చి అమ్మకాలు చేపడుతున్నారని ఎక్సైజ్ ఎస్‌టీఎఫ్ సీఐ మహేష్ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 

ధూల్‌పేట్‌లో..  

ధూల్‌పేట్‌లో రెండుచోట్ల నిర్వహించిన దాడుల్లో 2.89 కిలోల గంజాయిని పట్టుకొని పింటసింగ్, రచనబాయి, సంజనబాయి, కమలాబాయి, దివ్యసింగ్ అనే ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు  ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఎస్‌టీఎఫ్‌టీం లీడర్ నంద్యాల నర్సిరెడ్డి తెలిపారు.