హుమాయున్ నగర్: హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. హుమాయున్ నగర్ లో శుక్రవారం భారీగా డ్రగ్స్ పట్టుబడింది. రెండు కేసుల్లో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న విదేశీయుడితో పాటు ముగ్గురు హైదరాబాదీలను అరెస్ట్ చేశారు. విదేశీయుడిని అరెస్టు చేసిన కేసులో రూ. 25 లక్షల విలువ చేసే 50 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో 80 గ్రాముల ఎండీఎంఏ,ఎల్ఎస్ డీ బ్లాట్స్ స్వాధీనం చేసుకుని ఇద్దరని అరెస్ట్ చేశారు. హెచ్న్యూ పోలీసుల ఆపరేషన్లో నలుగురు డ్రగ్స్ పెడ్లర్లు పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ పై ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్న రోజు ఎక్కడో అక్కడ డ్రగ్స్, గంజాయి పట్టుబడుతూనే ఉంది.