calender_icon.png 27 October, 2024 | 10:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాలిపోతున్నారు!

27-10-2024 02:18:54 AM

జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారెజ్ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ‘ప్రజలు తమ వద్దకు వచ్చి అయ్యా మాకు ఈ సమస్య ఉంది..అంటే వెళ్లి పరిష్కరించేవాళ్లం. కానీ ఇప్పుడు సమస్య ఉందని తెలిస్తే చాలు ఎగబడిపోతున్నాం’ అని ఎన్టీఆర్ అంటారు. సరిగ్గా ఇలాగే ఉంది ప్రస్తుత కేటీఆర్, హరీశ్‌రావు తీరు. సమస్య ఉందని తెలిస్తే..కాదు తెలుసుకొని మరీ అక్కడికి వాలిపోతున్నారు.

అది చిన్నదా..పెద్దదా! వాళ్లు దానిపై స్పందించేంత పెద్ద అంశం ఉందా అని కూడా చూడడంలేదు. ప్రత్యక్షంగా, సోషల్ మీడియాలో ఏదీ పడితే దానిపై బీఆర్‌ఎస్ ముఖ్యనేతలిద్దరూ మాట్లాడుతుండటంతో జనంలో పలుచన అవుతున్నారనే చర్చ జరుగుతోంది.

అధికారంలో వాళ్లున్నప్పుడు పరిష్కరించాల్సిన సమస్యలను అప్పుడు పట్టించుకోకుండా, ఇప్పుడు అదే సమస్యలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి ప్రజల్లో పేరున్న ఇద్దరు నాయకులు పలుచన అవుతున్నారని గుసగుసలాడుకుంటున్నారు.