- ఇద్దరు మహిళలను ఢీకొట్టిన కారు.. ఇద్దరూ అక్కడికక్కడే మృతి
మరో ఇద్దరు బాలికలకు గాయాలు
నిజామాబాద్, జూలై 14 (విజయక్రాం తి): నిజమాబాద్ జిల్లా మక్లూరు మండలం దాస్నగర్లో కారు బీభత్సం సృష్టించింది. రాంగ్సైడ్లో వస్తూ రోడ్డుపై నడుచుకుం టూ వస్తున్న నలుగురిని ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు గాయాల పాలయ్యా రు. డ్రైవర్ మద్యంతో మత్తులో కారు నడపడంతోనే ప్రమాదం సంభవించింది. నిజా మాబాద్ నార్త్ రూరల్ సర్కిల్ సీఐ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్ మండ లం మావందిఖుర్దుకు చెందిన శ్రీరాం పద్మ (35), ఇందల్వాయి మండలం సిర్నాపల్లికి చెందిన కొత్తూరు పోచవ్వ (50) ఆదివారం దాస్నగర్ కస్తూర్బా విద్యాలయంలో చదువుతున్న తమ పిల్లలను చూడటానికి వచ్చా రు. వీరు మరికొందరు పిల్లల తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు.
ఈక్రమంలో వారిపైకి కారు దూసకువచ్చి ఢీకొట్టింది. అనంతరం రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. ఘటనలో పద్మ, పోచ వ్వ తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతిచెందగా, వారి కుమార్తెలు ఈశ్వరి, గౌతమి తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు స్వల్పగాయాల పాలయ్యారు. స్థానికులు క్షత గాత్రులను ఓ వాహనంలో నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మద్యం తాగి నిర్లక్ష్యంగా కారు నడిపిన డ్రైవర్ సాయికుమార్కు దేహశుద్ధి చేసి మాక్లూరు పోలీ సులకు అప్పగించారు. నిందితుడు ఆర్టీఏ కార్యాలయంలో డ్రైవర్గా పనిచేస్తున్నాడని తెలిసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులు ఈశ్వరి , గౌతమిని అదనపు కలెక్టర్ అంకిత్ పరామర్శించారు. ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.