calender_icon.png 27 September, 2024 | 2:37 PM

రెండు బస్సులు ఢీ: డ్రైవర్ మృతి

27-09-2024 11:38:58 AM

నర్సాపూర్మెదక్ జిల్లా నర్సాపూర్ శివారులోని శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బి.వి.ఆర్.ఐ.టి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన రెండు బస్సులు ఢీకొనడంతో డ్రైవర్ మృతి చెందారు. పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.