18-03-2025 01:05:19 AM
నెల రోజులుగా కాలనీలకు అందని నీటి సరఫరా
ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో అధికారుల విఫలం
ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేసిన మహిళలు
జిల్లా కలెక్టర్ సమస్యను పరిష్కరించాలని మహిళల వేడుకోలు
కోనరావుపేట, మార్చి 17: వేసవికాలం ప్రారంభం ముందే తాగునీటి సమస్య. తలెత్తింది. తాగునీటి సమస్య పరిష్కరించాలం టూ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డు ఎక్కుతున్నారు. గుక్కెడు నీటికి రోజుల తరబడి వేచిచూసినా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. నల్లా నీరురాక, మిషన్ భగీరథ నీరు సరఫరా కాక గ్రామస్తులు తల్లడిల్లుతున్నారు.
స్థానికంగా ఉన్న బోర్లు నిర్వీర్యమ వ్వడంతో గత్యంతరం లేక వ్యవసాయ మోటర్ల వద్ద నీటిని తెచ్చుకుని అవసరాలు తీర్చుకుంటున్నారు. నల్లా నీరు వస్తలేదని అధికారుల దృష్టికి తీసుకెళ్తే గ్రామపంచాయతీలో డబ్బులు లేవంటూ నిర్లక్ష్యపు సమా ధానం చెపుతున్నారు. ఈ దుస్థితి కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలోని 1,10వ వార్డులలో చోటు చేసుకుంది.నీటిగోస తీర్చేవారే లేరా అంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలోని నల్ల బావిలో మంచినీరు ఉన్న 1,10వ వార్డులలో నీటి సరఫరా నిలిచిపోయింది. ఈ సమస్య గత నెల రోజుల క్రితం తలెత్తగా అధికారులు ఇటువైపు రావడం లేదని మహిళలు చెపుతున్నారు. ప్రధానంగా బావి నుండి వచ్చే పైపులైన్కు గేటు వాలు ఏర్పాటు చేయకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని చెబుతున్నారు. అంతేకాకుండా మిషన్ భగరథ ద్వారా నీరు అందించాలని కోరగా ఒక రోజు మాత్రమే నీటిని అందించి చేతులు దులుపుకున్నారన్నారు.
మిషన్ భగీరథ నీరు రోజు అందించాలని వేడుకున్న మోటర్లు సరిగా లేవని అధికారులు చెపుతున్నారని వాపోయారు. కాగా, వార్డులో తాగునీరు లేక నెల రోజులుగా ఇబ్బందిపడుతున్నామన్నారు. వ్యవసాయ బోరుబావు లకు వెళ్లిపొలం గట్లపై పడుతూ లేస్తూ నానా అవస్థలు పడుతున్నా పట్టించుకునే వారే లేరన్నారు.
వ్యవసాయ బోరుబావులు సైతం వట్టి పోతుండడంతో దూరం వెళ్లి తాగునీరు తెచ్చుకోవాల్సి వస్తుందని గెంటే ఎల్లవ్వ అన్నారు. అధికారులు చెపితే గ్రామపంచాయతీలో పైసలు లేవని, మాకు నీటి సమస్యను పరిష్కారించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఇరిగేషన్ అధికారులు గ్రామానికి విచ్చేసి నీటి సమస్య లేకుండా పరిష్కారం చేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు.