09-04-2025 11:40:22 PM
యువతిని కాపాడిన సిబ్బందిని అభినందించిన హైడ్రా కమిషనర్...
హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎళ్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. డీఆర్ఎఫ్ బృందాల అప్రమత్తతతో కొంతమేర నష్టాన్ని తగ్గించగలమన్నారు. మంగళవారం హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్యకు యత్నించిన ఓ యువతిని కాపాడిన హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది మార్షల్ ఫకృద్దీన్, డీఆర్ఎఫ్ సహాయక సిబ్బంది ఎ. రమేష్, ఎన్. శ్రీనివాస్, ఎండీ ఇమాముద్దీన్, కె. కార్తీక్ కుమార్లను కమిషనర్ అభినందించారు. హుస్సేన్ సాగర్లోకి దిగడానికి కూడా వీలు లేని చోట తాళ్ల సాయంతో యువతిని సురక్షితంగా కాపాడారన్నారు. గత గురువారం భారీ వర్షం కురవగా ఒక్కసారిగా వచ్చిన వరదతో మూసీ నదిలో చిక్కుకున్న ఇద్దరిని కాపాడిన డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా ఆయన అభినందించారు.