calender_icon.png 23 October, 2024 | 4:44 AM

డబుల్ బెడ్‌రూం ఇళ్లు కేటాయించాలి

22-07-2024 03:13:35 AM

హనుమకొండ, జూలై 21 (విజయక్రాంతి): హనుమకొండ బాలసముద్రంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించాలంటూ గుడిసెవాసులు ఆందోళ నకు దిగారు. గతకొన్ని రోజుల నుంచి ఇళ్లు తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్న గుడిసెవాసులు ఆదివారం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల తాళాలు పగులగొట్టి ఆక్రమించు కున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నుంచి బయటకు పంపే ప్రయత్నం చేయగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఘర్షణ వాతావరణంలోనే ఆందోళనకారులను పో లీసులు ఇళ్లు ఖాళీ చేయించారు. గత ప్రభుత్వం తమకు ఇళ్లు కేటాయిస్తామని మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నా ఇళ్లు కేటాయించడంలో విఫలమైందని గుడిసెవా సులు ఆరోపించారు.