calender_icon.png 20 April, 2025 | 1:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనుగోలు సమయంలో ఇబ్బందులు రావొద్దు

10-04-2025 12:21:26 AM

చెన్నూర్, ఏప్రిల్ 9 : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, కేంద్రాలకు వచ్చిన వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ అన్నారు. చెన్నూరులో బుధవారం దాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొనుగోలుకు అవసరమైన సామాగ్రిని అందుబా టులో ఉంచుకోవాలని ఆయన సూచించా రు. ప్రతి కేంద్రంలో కనీసం 25 టార్పాలిన్ కవర్లు అందు బాటులో ఉంచుకోవాలని, కొనుగోళ్లకు సంబంధించి వివరాలు ఎప్పటికప్పుడు ట్యాబ్ లో నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల అధికారి బ్రహ్మారావు, పోరా సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకళ, డీఆర్డీవో కిషన్ పాల్గొన్నారు.