calender_icon.png 29 September, 2024 | 7:55 AM

అంబేడ్కర్ వర్సిటీ భూములివ్వొద్దు

29-09-2024 01:11:02 AM

సీఎం రేవంత్ రెడ్డికి విద్యావంతులు లేఖ

హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ భూమిని ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి ఇవ్వొద్దని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మేధావులు, విద్యావంతులు లేఖ రాశారు. ఓపెన్ వర్సిటీకి చెందిన భూమిని జవహర్‌లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి చెందిన పదె ఎకరాలను కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం, హరగోపాల్, నాగేశ్వర్, ఘంటా చక్రపాణి, దొంతి నరసింహారెడ్డి తదితరు లు లేఖలో కోరారు. నామమాత్రం ఫీజుతో విద్యనందిస్తున్న ఏకైక వర్సిటీ ఓపెన్ వర్సిటీ అన్నారు. ఉన్నత విద్యావ్యాప్తికి విశ్వవిద్యాలయం చేస్తున్న కృషిని లేఖలో వారు ప్రస్తావిస్తూ  ప్రభుత్వం పునరాలోచించాలన్నారు.