calender_icon.png 28 September, 2024 | 12:53 AM

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయవద్దు

26-09-2024 02:50:33 AM

ఎమ్మెల్యే మక్కాన్ సింగ్

పెద్దపల్లి, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి)/ రామగుండం: కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్న ధీమాతో ఉండవద్దని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేకుండా పని చేయాలని రామగుం డం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఐఎన్టీయూసీ కార్యకర్తలకు సూచించారు. గో దావరిఖనిలోని జనక్ భవన్‌లో బుధవారం జరిగిన ఐఎన్టీయూసీ కార్యకర్తల సమావేశ ంలో ఆయన మాట్లాడారు.

అధికారంలో ఉన్నది మన ప్రభుత్వమన్న గర్వంతో ఉండ వద్దని సూచించారు. మంత్రి శ్రీధర్‌బాబు సహకారంతో సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రామగుండంకు 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ తీసుకవచ్చానని తెలిపారు. సింగరేణి కార్మికుల సమస్యలను యాజమా న్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాల్సిన బాధ్యత కార్యకర్తలుగా మీపైనే ఉంటుంద న్నారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ సెక్రెట రీ జనరల్ జనక్ ప్రసాద్ పాల్గొన్నారు.