23-03-2025 11:38:55 AM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సీతాయి పల్లి గ్రామంలో నిర్వహించే అఖండ సప్తహ కార్యక్రమానికి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమారుడు పటాన్ ఎజాస్ ఖాన్ 12000 రూపాయలు విరాళంగా ఆదివారం అందజేశారు. గ్రామంలో వారం రోజులపాటు అఖండ సప్తహ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మల్లెబోయిన నారాయణ, మాజీ ఉపసర్పంచ్ సింగసాని పండరి భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.