23-03-2025 07:50:11 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఓ ఉద్యోగి ఒక నెల మొదటి వేతనాన్ని ఆదివారం విరాళంగా అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మల గ్రామానికి చెందిన పురం తిరుపతిరావు కవితల కుమారుడు మొదటి నెల వేతనం రూ. 51,016 రూపాయలు విరాళంగా ఆలయ కార్యనిర్వణాధికారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది ఆధ్వర్యంలో దాతలను సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీధర్ రావు ఆలయ ప్రధాన అర్చకులు నరసింహచార్యులు, శ్రీనివాసాచార్యులు, సంతోష్ చార్యులు, జూనియర్ అసిస్టెంట్ సంతోష్ కుమార్ భక్తులు తదితరులు పాల్గొన్నారు.