22-04-2025 04:58:15 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా దనసరి సొసైటీ డైరెక్టర్ కొండ్రెడ్డి రవీందర్ రెడ్డి శ్రీవాణి దంపతుల కుమారుడు హర్ష రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేసముద్రం ఆంజనేయ స్వామి దేవాలయానికి రూ.10,016 విరాళం అందజేశారు. దేవాలయ అభివృద్ధికి విరాళంగా ఇచ్చిన డబ్బులు వినియోగించాలని కోరారు. అనంతరం దేవాలయంలో హర్ష రెడ్డి క్షేమాన్ని కాంక్షిస్తూ అర్చకుడు శ్రీకాంత్ పూజలు నిర్వహించి కొండ్రెడ్డి రవీందర్ రెడ్డి శ్రీవాణి దంపతులను ఆశీర్వదించారు.