18-03-2025 01:21:29 AM
మఠంపల్లి, మార్చి 17: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం, మట్టపల్లి మహాక్షేత్రము, ధాన్యాయి ఎంటర్ ప్రైసెస్ ప్రైవైట్ లిమిటెడ్, మనోజ్ కుమార్ వారు వేసవికాలము దృష్ట్యా శ్రీ స్వామి వారి దర్శనమునకు విచ్చేయు భక్తుల సౌకర్యార్ధం నిమిత్తం చల్లటి త్రాగునీరు కొరకు రెండు కూల్ వాటర్ మిని ఫ్రిడ్జ్ లను సోమవారం దేవస్థానమునకు అందజేసారు. ఇట్టి కార్యక్రమములో దేవస్థాన అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్ కుమార్, అర్చకులు, సిబ్బంది పాల్గోన్నారు.