26-03-2025 01:33:55 AM
హుజూర్ నగర్, మార్చి 25: శ్రీ ఆదివరాహ లక్ష్మి నరాసింహ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం లో ఉన్న గోశాలకు ఒక ట్రక్కు వరిగడ్డినీ బూరుగడ్డ గ్రామానికి చెందిన యరగాని నరసింహారావు ఉషారాణి దంపతులు.అలాగే 15116 రూపాయల విలువ గల త్రీడి ఎల్ఈడి లైట్ల తో స్వామి వారి యొక్క పేరు వచ్చే ఎలక్ట్రికల్ మిషన్ ని కల్మలచెరువు గ్రామానికి చెందిన పాశం లచ్చిరెడ్డి,సరిత దంపతులు బహుకరించడం జరిగింది. వారి కుటుంబాలకు అమ్మ వారి, స్వామి సంపూర్ణ శుభఆశీస్సులు కలగాలని ఆలయ అర్చకులు ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్, పాలకవర్గం, కార్యనిర్వహణ అధికారి సిబ్బంది పాల్గొన్నారు.