యాదాద్రి భువనగిరి (విజయక్రాంతి): యాదాద్రి నృసింహుడి విమానగోపురం స్వర్ణ తాపడం పనులకు దేవస్థానం భక్తుల నుంచి విరాళాలు కోరుతుండటంతో భారీ స్పందన వస్తోంది. హైదరాబాద్ కు చెందిన భక్తుడు కంకర్ సుద్వీర్ రెడ్డి గురువారం శ్రీ స్వామి వారి దివ్య విమాన గొపురమునకు బంగారు తాపడం నిమిత్తము రూ.10,00,116/- విరాళము సమర్పించారు. ఈ మేరకు చెక్కు ఆలయ కార్యనిర్వహణాధికారి భాస్కర్ రావుకు అందజేశారు. అదే విధంగా ఈ రోజు సినీ నటులు సుమన్ శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు.