calender_icon.png 18 October, 2024 | 9:59 PM

ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి విరాళం

18-10-2024 07:48:15 PM

చేగుంట,(విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలోని వడియారం ప్రాథమిక పాఠశాలలో "మన ఊరు మన బడి" పథకంలో భాగంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేయుటకు పాఠశాల ఉపాధ్యాయురాలు వసంత తన కుటుంబ సభ్యుల సహకారంతో ఒక లక్ష రూపాయలను ప్రకటించారు. పాఠశాలలో టాయిలెట్స్ లేక బాల, బాలికలకు ఇబ్బందులు ఉన్నందున వాటి పనులను పూర్తి చేయుటకు తక్షణ సహాయంగా రూ.25000 చెక్కును శుక్రవారం ఇవ్వడం జరిగింది. పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న వసంత ఉపాధ్యాయురాలుని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిద్దిరాములు,ఉపాధ్యాయ సిబ్బంది ప్రియదర్శిని, సంతోషిమాత, అమరేశ్వరి, అమ్మదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, స్థానిక మాజీ వార్డు సభ్యులు బండారి నాగరాజుఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ జేశారు.