21-04-2025 12:23:59 AM
మఠంపల్లి ఏప్రిల్ 20: మఠంపల్లి మండలంలోని కాల్వపల్లి తండా, కొత్త దొనబండ తండా అభయాంజనేయ స్వామి దేవాలయానికి వాల్ ఐరన్ ఫెన్సింగ్ కొరకు బానోతు బాలు నాయక్(ఎంఇఓ),సుకన్య దంపతులు రూ. 50,000 విరాళంగా దేవాలయం అర్చకులు ప్రసాద్, గ్రామ పెద్దలు సమక్షంలో అడ్వాన్స్ గా రూ. 25,000 ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కాల్వపల్లి తండా మాజీ సర్పంచ్ మాలోతు సక్రనాయక్, మాజీ ఎంపిటిసి బానోతు దేశ్ పాండు, బాణోతూ వెంకట్రాం, మాలోతు పాండు (డిఇ), బాబా, హజ్య నాగచారి, వైస్ చైర్మన్ సైదా, కమిటీ సభ్యులు భీముడు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయం అభివృద్ధికి సహకరించిన బాలు నాయక్ దంపతులకు కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.