calender_icon.png 26 October, 2024 | 5:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్తదానం మరొకరికి ప్రాణదానం

26-10-2024 03:15:27 PM

గోదావరిఖనిలో పోలీసుల అమరవీరుల వారోత్సవాల్లో రాక్తదానంలో రామగుండం సీపీ శ్రీనివాస్

పెద్దపల్లి (విజయక్రాంతి): రక్తదానంతో మరొకరికి ప్రాణదానమని, మన జీవితంలో రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయాలని రామగుండం సీపీ శ్రీనివాస్ అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల (ఫ్లాగ్ డే) సందర్భంగా పోలీస్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ వారి సహకారంతో శనివారం గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో రక్తదానం శిభిరాన్ని ఏర్పాటు చేయగా సీపీ శ్రీనివాస హాజరై పోలీస్ అధికారులతో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. అమరవీర జవానులను స్మరించుకుంటూ అక్టోబర్ 21 నుండి అక్టోబర్ 31 వరకు పోలీస్ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా  కమీషనరేట్ పరిధిలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని, అన్నిటికంటే గొప్పదానమైన రక్తదానం ద్వారా ప్రాణాలు కాపాడాలని సూచించారు. సకాలంలో రక్తం అందించలేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయ్యారని, రక్తదానం ఇవ్వడానికి వాలంటరీగా వచ్చిన అందరిని సీపీ అభినందించారు. శిబిరంలో పోలీసులతో పాటు స్థానిక యువత 200 మంది పాల్గొని ఉత్సాహంగా రక్తదానం చేయడానికి రావడం ఎంతో అభినందనీయమని అన్నారు. రక్తదానం చేసిన వారికి సీపీ సర్టిఫికేట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ రమేష్, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, గోదావరిఖని 2 టౌన్ ఇన్ స్పెక్టర్ ప్రసాదరావు, రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్, మంథని సిఐ రాజు, గోదావరిఖని సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.