10-04-2025 12:00:00 AM
మందమర్రి, ఏప్రిల్ 9: రక్తదానం మరొకరికి ప్రాణదానమని, ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ జి దేవేందర్ కోరారు. ఏరియాలోని గనుల వృత్తి శిక్షణ కేంద్రంలో బుధవారం సింగరేణి యాజమాన్యం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసై టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.
సింగరేణి కార్మికులు సమాజ సేవలో ముందు వరుసలో ఉంటారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం విజయ్ ప్రసాద్, ఏఐటీయూసీ బ్రాంచి సెక్రెటరీ సలేంద్ర సత్యనారాయణ, వృత్తి శిక్షణ మేనేజర్ శంకర్, ట్రైనింగ్ అధికారి అశోక్ కుమార్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు శ్రీనివాస్, తలసేమి యా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రంజిత్ కుమార్ పాల్గొన్నారు.