04-03-2025 11:50:37 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో గ్రామ శివారు వద్ద దోమకొండ ఎస్సై స్రవంతి ఆధ్వర్యంలో మంగళవారం పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేశారు. వాహనదారులు వెహికల్ పై వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెల్మెట్ ధరించాలని డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ అన్ని పత్రాలు ఉండాలని ఆమె సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని పెద్దలకు సూచించారు వాహనాలపై వెళ్లేటప్పుడు అతి స్పీడుగా వెళ్లడం అంత మంచిది కాదని ఆమె అన్నారు. మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది జీవితాలను పాడు చేసుకోవద్దని ఆమె ఇతవు పలికారు.