calender_icon.png 21 October, 2024 | 2:01 PM

పోలీస్ సిబ్బందిపై కుక్కల దాడి

21-10-2024 11:20:35 AM

అలంపూర్: అలంపూర్ జోగులాంబ దేవస్థానంలో ఆదివారం రాత్రి వీఐపీ బందోబస్తు కొరకు వచ్చిన పోలీస్ సిబ్బంది, ఏఎస్ఐ భాషపై కుక్కలు దాడి చేశాయి. గాయపడిన పోలీస్ సిబ్బందిని  ఆస్పత్రికి తరలించారు. అలంపూర్ లో కుక్కలు ఎక్కువగా ఉన్నాయని, కుక్కలను నివారించాలని భక్తులు కోరుతున్నారు. కర్ణాటక నుంచి శ్రీశైలం వెళ్లే పాదయాత్ర భక్తులు వెంట తెచ్చుకున్న కుక్కలను తుంగభద్ర నది, నల్లమల అడవి ఉన్నందున ఇక్కడే వదిలేస్తున్నారు. దీంతో కుక్కల బెడద ఎక్కువైందని స్థానికులు అంటున్నారు.