07-02-2025 01:43:28 AM
మంథని, ఫిబ్రవరి 6 (విజయ క్రాంతి): మండలం కన్నాల గ్రామానికి చెం కావటి సతీశ్కుమార్యాదవ్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరే ట్ సాధించారు. ఓయూ తెలుగు శాఖలో ఆచార్య కిషన్రావు పర్యవేక్షణలో ఒగ్గు మందెచ్చు కళా సాహిత్యం సమపరిశీలన అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ సాధించారు.
కావటి మల్ల దంపతుల ఆరుగురు సంతానంలో సతీశ్ ఐదవ సంతానం. సతీశ్ ప్రాథమిక విద్యాభ్యాసం మంథనిలో పూర్తిచేసి పీజీ ఎంఏ తెలుగు ఎంట్రన్స్లో ఐదవ ర్యాంకు సాధించి ఓయూలో పూర్తి చేశారు. 10 జాతీ య సెమినార్లు ఐదు అంతర్జాతీయ సెమినార్లలో పత్ర సమర్పణ చేశారు.
తెలంగాణ ఉద్యమ సమయం లో ఓయూ జేఏ అధ్యక్షుడిగా పోరాటం చేసి తెలంగాణ సాధనకు ఎంతో కృషి చేసి పోలీస్ కేసులను కూడా ఎదుర్కొన్నారు. ఒగ్గు కథకుల కుటుంబంలో జన్మిం ఒగ్గు కథలోనే పీహెచ్డీ చేసిన మొట్టమొదటి వ్యక్తిగా గుర్తిం సాధించాడు.