18-03-2025 12:00:00 AM
పటాన్ చెరు, మార్చి 17 : హైదరాబాద్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని గణిత విభాగం పరిశోధక విద్యార్థి ఎన్.శ్రీనివాస్ డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘బీజ గణిత విధానంలో వైబ్రేషనల్ హామిల్టోనియన్ ఉపయోగించి పాలిటామిక్ అణువుల వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీలను అధ్యయనం’ చేసి సిద్ధాం త వ్యాసాన్ని సమర్పించారు.
ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ స్కూల్, గణిత శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జె.విజయశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. డాక్టర్ శ్రీనివాస్ సైద్ధాంతిక భౌతిక శాస్త్రం, అనువర్తిత గణితం, మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీని అనుసంధానించే ఒక వినూత్న అధ్యయనాన్ని నిర్వహించారు.
ఆయన పరిశోధన వైబ్రేషనల్ హామిల్టోనియన్ లను మోడల్ చేయడానికి సమరూప- అడాప్టెడ్ వన్-డైమన్షనల్ లై బీజగణిత చట్రాన్ని ఉపయోగిస్తుంది. డైక్లోరిన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, ఆక్సిజన్ డైఫ్లోరైడ్, సిలేన్, నాఫ్తలీన్ వంటి పాలిటామిక్ అణువులలో ప్రాథమిక, అధిక ఓవర్ టోన్ పౌన:పున్యాల ఖచ్చితమైన గణనలను అనుమతిస్తుంది.
అంతేకాక, పర్యావరణ పర్యవేక్షణ, వాతావరణ రసాయన శాస్త్రం, పదార్థ శాస్త్రం, ఔషధాలలో విస్తృత ప్రభావాన్ని చూపుతుంది. పరమాణు కంపనాల అవగాహనను అభివృద్ధి చేయడం ద్వారా, ఆయన పరిశోధన స్థిరమైన సాంకేతికతలు, రసాయన విశ్లేషణలలో అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుంది.
డాక్టర్ శ్రీనివాస్ సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్, గణిత శాస్త్ర విభాగాపతి డాక్టర్ ఎం.రెజా, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు పేర్కొన్నారు.