calender_icon.png 25 October, 2024 | 5:45 AM

వైద్యుల కాసుల కక్కుర్తి.. రోగులు కాటికి!

09-08-2024 02:34:37 AM

  1. వచ్చీరాని వైద్యంతో ప్రాణాలతో చెలగాటం
  2. చట్ట వ్యతిరేకంగా లింగ నిర్ధారణ పరీక్షలు 
  3. నాగర్‌కర్నూల్‌లో హెల్త్ మాఫియా ఆగడాలు
  4. నూతన వైద్యాధికారి ముందు పెను సవాళ్లు

నాగర్‌కర్నూల్. ఆగస్టు 8 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లాలో హెల్త్ మాఫి యా చెలరేగిపోతోంది. కాసుల కక్కుర్తితో ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు, వైద్యు లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. చట్టవ్యతిరేకంగా లింగనిర్దారణ పరీక్షలు చేయ డం తోపాటు వచ్చీరాని వైద్యంతో అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారు. రోగం నయంచేసి పునర్జన్మ ప్రసాదిస్తారని హాస్పిటల్‌కు వెళ్తే ఉన్న ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అయినా ప్రాణం దక్కుతుందన్న గ్యారెంటీ లేదు. సంపాదనే లక్ష్యంగా వచ్చీరాని వైద్యం చేస్తూ రోగుల ప్రాణాలకు ఎసరు తెస్తున్న ఇలాంటి దవాఖానలకు కొందరు పొలిటికల్, వ్యాపార, జర్నలిజం ముపుగుతో బాడీగార్డులుగా వ్యవహరించడం గమనార్హం.

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంగా మారడంతోపాటు ఈ ప్రాం తంలో మెడికల్ కళాశాల ఏర్పాటు కావడంతో నూతన హాస్పిటల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. నిబంధనలను పాటించకుండానే అడ్డగోలుగా అనుమతులు పొంది న యాజమాన్యాలు వాటిని కాపాడుకునేందుకు తెరవెనుక బాడీగార్డులను పెట్టుకుం టున్నట్టు విమర్షలున్నాయి. దీంతో ప్రసవం కోసం వెళ్లే గర్భిణులను వారి వెంట వెళ్లే బంధువులను భయబ్రాంతులకు గురిచేసి నార్మల్ డెలివరీ అవకాశం ఉన్నా సిజేరియ న్లు చేసి లక్షలు వసూలు చేస్తున్న దుస్థితి. ఇతర వ్యాపకాలున్న కొందరు వైద్యులు ఎక్కడో ఉండీ.. సిబ్బందితో వీడియో కాల్ ద్వారా వైద్యం చేయిస్తూ ప్రజలను బలిగొంటున్న ఘటనలు ఇటీవల వెలుగుచూశాయి.

మరికొన్ని హాస్పిటల్స్ డబ్బులకు కక్కుర్తి పడి నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు జరిపి ఆడపిల్ల అని తెలిస్తే అబార్ష న్లు కూడా చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలామంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు వెలుగుచూశాయి. సంబంధిత అధికారులకు తెలిసి కూడా చర్యలు తీసుకునే సాహసం చేయకపోవడంతో హెల్త్ మాఫియా చెలరేగిపో తోంది.

ముఖ్యంగా ఆర్‌ఎంపీ, పీఎంపీలు కూడా స్థాయికి మించిన వైద్యం చేస్తూ అమాయకులను పొట్టనబెట్టుకుంటున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. దీంతో పాటు జిల్లాలోని ఆయా ఆసుపత్రులలో అర్హతలేని వారే డయాగ్నోస్టిక్ సెంటర్లను నడుపుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. నూతనంగా జిల్లాకు బదిలీపై వచ్చిన వైద్యాధికారిణి స్వరాజలక్ష్మి ప్రత్యేదృష్టి సారించి ప్రైవేటు ఆసుపత్రుల ఆగడాలను, మాతాశిశు మరణాలను నిలువరిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. 

జిల్లాలో జరిగిన పలు ఘటనలు

  1. రెండేళ్ల క్రితం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన శివ నర్సింగ్‌హోమ్‌లో తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామాని కి చెందిన గర్భిణికి దవాఖానలో సాధారణ వ్యక్తి వైద్యం చేయడంతో మృతి చెందింది. దీనిపై అప్పటి కలెక్టర్ విచారకణకు ఆదేశించినా అది తెరమరుగైంది. 
  2. నాగర్‌కర్నూల్ పట్టణంలోని హౌజింగ్ బోర్డు కాలనీలోని ఓ మహిళా ఆర్‌ఎంపీ.. అబార్షన్ చేయడంతో తీవ్ర కడుపునొప్పితో బాధితురాలు కేకలు వేయడంతో విషయం కాలనీవాసుల ద్వారా బయటపడింది. 
  3. జిల్లా ప్రధాన దవాఖానకి ఎదురుగా ఉన్న ఓ వైద్యుడి వద్ద కారు క్లీనరుగా పనిచేస్తూ సొంతంగా కార్పొరేట్ లెవల్‌లో హాస్పిటల్‌ను ఏర్పాటు చేశాడు. యునానీ వైద్యంతోపాటు పసరు వైద్యం అందిస్తూ పదుల సంఖ్యలో జనాన్ని పొట్టనబెట్టుకున్నాడు.
  4. నాగర్‌కర్నూల్ ఎర్రగడ్డ కాలనీలో ఎలాంటి అర్హత లేకున్నా పసిరికల కోసం మందులు ఇస్తూ అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. 
  5. రెండు నెలల క్రితం ప్రియాంక దవాఖానలో తాడూరుకు చెందిన గర్భిణీ పద్మ పరీక్షల కోసం వస్తే.. వైద్యుడు ఫోన్ ద్వారా చెప్పిన వైద్యం వికటించి మరణించింది. 
  6. రెండు రోజుల క్రితం కావ్య అనే మహిళ పురిటి నొప్పులతో హాస్పిటల్‌కు వస్తే కాసులకు కుక్కర్తి పడి హైరిస్క్ కేసును కూడా వీడియోకాల్  ద్వారా చేసిన వైద్యం వికటించి ఆమె మరణానికి కారణమయ్యారు. 
  7. అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రైవేటు హాస్పిటల్స్, ఆర్‌ఎంపీ కేంద్రాల్లో వచ్చీరాని వైద్యానికి ఎందరో బలవుతున్నా రు. కొన్ని వెలుగులోకి వస్తుంటే.. కొన్ని అక్కడే కనుమరుగు అవుతున్నాయి.

మెరుగైన వైద్యం అందించేలా చూస్తాం 

నేను జిల్లాకు వచ్చి నాలుగు రోజులు మాత్రమే అవుతోంది. ఇప్పటివరకు సీజనల్ వ్యాధులు, ఇతర అంశాలపై రాష్ట్ర స్థాయి అధికారులతో సమావేశాల్లో పాల్గొన్నాం. ఇటీవల ఓ బాలింత మృతిచెందడం బాధాకరం. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. అర్హ త లేకున్నా స్థాయికి మించిన వైద్యం చేయడం సరికాదు. వాటిపై కఠినంగా వ్యవహరిస్తం. లింగ నిర్ధారణ పరీక్షలు చేసే హాస్పిటల్స్‌పై నిఘా పెట్టాం. అలాం టి దవాఖానల గురించి తెలిస్తే మాకు ఫిర్యాదు చేయవచ్చు.

 స్వరాజ లక్ష్మి, 

జిల్లా వైద్యాధికారి, నాగర్‌కర్నూల్