విద్యార్థిని చితకబాదిన టీచర్
పాఠశాల ఎదుట తల్లిదండ్రుల ఆందోళన
నాగర్కర్నూల్, అక్టోబర్ 1(విజయక్రాం తి): తరగతి గదిలో పాఠం చెబుతుండగా నవ్విండన్న సాకుతో పదవ తరగతి విద్యార్థి పై ఉపాధ్యాయుడు పైశాచికంగా దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా కేం ద్రంలోని ప్రిజం ప్రైవేట్ పాఠశాలలో మంగళవారం జరిగింది.
నాగర్కర్నూల్కు చెందిన విద్యార్థి తౌఖిర్ నల్లవెల్లి రోడ్డులోని ప్రిజం ప్రైవేట్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. సోమవారం తరగతి గదిలో పాఠాలు బోధిస్తుండగా సదరు విద్యార్థి నవ్విండని పవ న్ అనే ఉపాధ్యాయుడు కర్రతో విచక్షణా రహితంగా కర్ర విరి గేదాకా కొట్టాడు. విష యం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మం గళవారం పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు.