calender_icon.png 23 October, 2024 | 9:00 PM

ఆగస్టు 5 నుంచి రెగ్యులర్ షూట్ తెలుసు కదా

21-07-2024 12:19:45 AM

సిద్దు జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్’ తర్వాతి ప్రాజెక్ట్ ‘తెలుసు కదా’తో అలరించబోతున్నారు. స్టైలిస్ట్‌గా మంచి పేరున్న నీరజ కోన ఈ మూవీతో డైరెక్టర్‌గా మారుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండగా, రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 5 నుంచి ప్రారంభం కానుంది.  హైదరాబాద్‌లో 30 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో లీడ్ కాస్ట్ పాల్గొంటారని చిత్రబృందం తెలిపింది. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా తనతో జత కడుతున్న ఈ సినిమా కోసం సిద్దూ జొన్నలగడ్డ స్టైలిష్‌గా మేకోవర్ కానున్నారు. ఈ చిత్రంలో వైవా హర్ష కీలక పాత్రలో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా, జ్ఞానశేఖర్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.