20-03-2025 12:00:00 AM
సిరిసిల్ల, మార్చి 19(విజయక్రాంతి): 2025- 26 ఆర్థిక సంవత్సరంలో 3,04,965 కోట్ల రూపాయలతో రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 40,231, 61, 80 కోట్ల రూ. లతో ఎస్సీ ఎస్ డి ఎఫ్ క్రింద కేటాయించారని కాగితాల్లో అంకెలు పెంచుతూ ఖర్చులు తుంచుతున్నారని ప్రభుత్వం ప్రకటించిన చేవెళ్ల డిక్లరేషన్ అమలుకు కేటాయింపు జరగలేదని అంబేద్కర్ అభయహస్తానికి ఏటా 750 కోట్ల రూపాయల కేటాయిస్తామాన్న వాగ్దానం నిలబెట్టుకోలేకపోయిందని బడ్జెట్ ను సవరించి దళితుల జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించి వారి ప్రత్యక్ష ప్రయోజనాల కోసం ఖర్చు చేయాలని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి నాగరాజు డిమాండ్ చేశారు.