హైడ్రా కమిషనర్కు జగ్గారెడ్డి లేఖ
హైదరాబాద్, సెప్టెంబర్ 29(విజయక్రాంతి): సంగారెడ్డి నియోజకవర్గం లోనూ హైడ్రా కూల్చివేతలు ఉంటాయంటూ స్థానికులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆదివా రం హైడ్రా కమిషనర్ రంగనాథ్కు లేఖ రాశారు. ఔటర్ రింగ్రోడ్ లోపల మాత్రమే హైడ్రా చర్యలు ఉంటాయని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారని గుర్తుచేశారు.
స్థానిక అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. సంగారెడ్డిలో ఎలాంటి కూల్చివేతలు చేపట్టొద్దని, ఒకవేళ ఏమైనా చర్యలు తీసుకోదలిస్తే ముం దుగా తమ దృష్టికి తీసుకురావాలన్నా రు. సీఎంతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకుంటామన్నారు.