calender_icon.png 27 October, 2024 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడొద్దు

27-10-2024 12:47:38 AM

రాచకొండ సీపీ సుధీర్‌బాబు

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 26: శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడొద్దని రాచకొండ సీపీ సుధీర్‌బాబు అన్నారు. శనివారం ఆదిబట్ల పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను, రికార్డులను పరిశీలించడంతో పాటు పలు విభాగాల పనితీరును పరిశీలించారు.

సీసీ టీవీల నిర్వహణపై ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేయాలని, అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, సిబ్బంది ఎప్పుడూ అప్రమ త్తంగా ఉండాలని తెలిపారు. మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.