calender_icon.png 12 March, 2025 | 11:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాల ప్రాంగణంలోకి రంగులు తేవొద్దు

11-03-2025 11:44:01 PM

తెస్తే పరీక్షలు రాయనీయమంటూ జైపూర్ పాఠశాల హెచ్చరిక..

విద్యాశాఖ మంత్రి ఆగ్రహం..

జైపూర్: రాజస్థాన్ జైపూర్‌లో ఉన్న ఓ పాఠశాల వివాదాస్పద ఆదేశాలు జారీ చేసింది. హోలీ సందర్భంగా విద్యార్థులు ఎవరూ పాఠశాల ప్రాంగణంలోకి రంగులను తీసుకురావొద్దని, ఎవరైనా తీసుకొస్తే వారిపై పరీక్షలు రాయకుండా నిషేధం విధిస్తామని హెచ్చరించింది. దీనిపై ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మతపరమైన మనోభావాలు దెబ్బతినే విధంగా ఆదేశాలు జారీ చేసిన స్కూల్‌పై సీబీఎస్‌సీకి అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించారు.