న్యూఢిల్లీ, జూలై 2: డిమార్ట్ రిటైల్ స్టోర్లను నిర్వహిస్తున్న ఏవి న్యూ సూపర్మార్ట్స్ స్టాండెలోన్ ఆదాయం 2024 జూన్ 30తో ము గిసిన త్రైమాసికంలో 18 శాతం వృద్ధిచెంది రూ.13,712 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదేకాలంలో కంపెనీ రూ.11,584 కోట్ల టర్నోవర్ సాధించింది. జూన్ 30 నాటికి తాము 371 స్టోర్లను నడుపుతున్నట్టు ఏవిన్యూ సూపర్మార్ట్ మంగళవారం స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. మార్చితో ముగిసిన క్యూ4లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికరలాభం 22.4 శాతం వృ ద్ధితో రూ. 460 కోట్ల నుంచి రూ. 563 కోట్లకు చేరగా, ఆదాయం 20 శాతం పెరిగి రూ.12,727 కోట్లకు చేరింది.