calender_icon.png 24 February, 2025 | 7:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్ రెడ్డి ది అనుభవం లేని పాలన

24-02-2025 04:12:16 PM

కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ

కామారెడ్డి,(విజయక్రాంతి): రేవంత్ రెడ్డి అనుభవం లేని పాలన సాగిస్తున్నారని, మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ(BJP National Vice President, MP DK Aruna) అన్నారు. సోమవారం కామారెడ్డి భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

దేశ అభివృద్ధికి ప్రధాని మోడీ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ప్రపంచంలోనే భారతదేశానికి గుర్తింపు తెచ్చిన ఘనత ప్రధాని మోడీ కే దక్కుతుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బీజేపీ బలపరిచిన పట్టబద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ... పట్టభద్రులు అంజిరెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు.

ఉద్యోగులకు బకాయి పడ్డ ఐదు డిఏలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందన్నారు. ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న ఉద్యోగుల గురించి పట్టించుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి పథకంలో విఫలమైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి పథకంలో కేంద్రం వాటా  ఉందని త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు.

అనంతరం బార్ అసోసియేషన్ కు వెళ్లి న్యాయవాదులను కలిసి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం జిల్లా గ్రంథాలయం భవనంలో పట్టబద్రులను కలిసి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతరం లింగంపేట్ ఎల్లారెడ్డి మండల కేంద్రాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బీబీ పాటిల్, బిజెపి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, బిజెపి జిల్లా మాజీ అధ్యక్షురాలు అరుణతార, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.