ముగ్గురి అరెస్టు
ఘట్కేసర్, అక్టోబర్ 3: నిబంధనలకు విరుద్ధంగా ఫాంహౌజ్లో మద్యం సేవించి డీజే సౌండ్ సిస్టంతో న్యూసెన్స్ చేసిన ముగ్గురిని ఘట్కేసర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాలు.. ఘట్కేసర్ మున్సిపా లిటీ ఎదులాబాద్ సమీపంలోని కొత్తగూడెం వద్ద ‘లివ్ ఇన్’ ఫాంహౌజ్ను నిజాంపేట్కు చెందిన నలమాస అఖిల్ కుమార్ గౌడ్.. అతని మిత్రుడు అశోక్ బర్త్డే నిమిత్తం బుక్ చేశాడు.
ఈ క్రమం లో బుధవారం అర్ధరాత్రి ఫాంహౌజ్లో బర్త్డే వేడుకలో స్నేహితులతో కలిసి పూటుగా మద్యం సేవించి డీజే సౌండ్ సిస్టంతో న్యూసెన్స్ చేశారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు ఫాం హౌజ్కు చేరుకొని అఖిల్ కుమార్ గౌడ్తో పాటు డీజే సౌండ్ సిస్టం ఏర్పాటు చేసిన నిర్వాహకుడు పల్లెపాటి చరణ్, బర్త్డే జరుపుకొంటున్న అశోక్ను అరెస్టు చేశారు. అదేవిధంగా డీజే సౌండ్ సిస్టం, మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.