బుడాపెస్ట్: 45వ చెస్ ఒలింపియాడ్లో భారత గ్రాండ్మాస్టర్ల జోరు కొనసాగుతోంది. శనివారం పదో రౌండ్లో చైనాతో తలపడుతున్న మహిళల బృందంలో దివ్య దేశ్ముఖ్ మరో విజయాన్ని సాధించింది. తెల్ల పావులతో ఆడిన దివ్య.. షికున్ను 39 ఎత్తుల్లోనే మట్టికరిపించింది. ఇక తెలుగు గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక తన గేమ్ను డ్రా చేసుకుంది. తెల్ల పావులతో ఆడిన హారి క 33వ ఎత్తు వద్ద జినెర్తో గేమ్ డ్రాగా ము గించింది. మరో గ్రాండ్మాస్టర్ వంతిక అగర్వాల్ కూడా డ్రాతో సరిపెట్టుకుంది. మియోయితో జరిగిన గేమ్ను 36 ఎత్తు వద్ద ముగించింది. మరోవైపు పసిడి అందుకోవడానికి అడుగు దూరంలో నిలిచిన పురు షుల బృందం శనివారం పదో రౌండ్లో అమెరికాను ఎదుర్కోగా.. ప్రజ్ఞానంద పరాజయం చవిచూశాడు. వెస్లే చేతిలో 41వ ఎత్తు వద్ద ప్రజ్ఞా ఓటమి పాలయ్యాడు.